YS Jagan: ప్రజలకు చేరువగా హెల్త్హబ్స్
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే హెల్త్ హబ్స్ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే హెల్త్ హబ్స్ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థర్డ్వేవ్, హెల్త్హబ్స్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. కొవిడ్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో శిశువులు, చిన్నారుల వైద్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో గణనీయంగా కేసులు తగ్గుముఖం పట్టాయని, మే 16న 25.56శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జూన్ 12న 6.58 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. ఏడు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0-9శాతం లోపే ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, చికిత్స పొందుతూ 157 మంది మృతి చెందారని వివరించారు.
థర్డ్వేవ్ వార్తల నేపథ్యంలో చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించగా, మొత్తంగా 1600 ఐసీయూ బెడ్లు ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదేవిధంగా ఇప్పుడున్న ఆక్సిజన్ బెడ్లతో కలిపి 3,777 పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు. పీడియాట్రిక్ అంశాల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాలని సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?