Andhra News: చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్-14 ప్రకారం కమిషన్కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు నోటీసుల్లో తెలిపారు.
‘‘అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన తెదేపా నాయకులు అడ్డుకొని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. అక్కడి రోగులను భయాందోళనకు గురి చేసి నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానించడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 1998 మహిళా కమిషన్ చట్టం సెక్షన్ 15(1) ప్రకారం విచారణకు ఆదేశిస్తున్నాం. నిర్దేశించిన సమయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు కూడా ఇదే తరహా నోటీసులు జారీ చేశాం. ఆయనకు కూడా ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించాం’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!