AndhraPradesh : ‘చలో విజయవాడ’ విజయవంతంపై సీఎం జగన్ ఆరా
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. సచివాలయంలో జగన్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్...
అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. సచివాలయంలో జగన్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ కలిశారు. చలో విజయవాడ విజయవంతం కావడంపై చర్చించారు. ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు చలో విజయవాడకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత, దివ్యాంగ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది భారీగా తరలివచ్చారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి పెన్డౌన్ను చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీ అర్ధ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు తెలిపారు.
కొత్త విద్యావిధానం వల్ల 22వేల మందికి పదోన్నతి: జగన్
క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై జగన్ సమీక్షించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉంటాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. కొత్త విద్యా విధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి వస్తుందన్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ఆదేశించారు. పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జూన్ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని తెలిపారు. ప్రతి మండలంలో రెండు హైస్కూళ్లు, రెండు కాలేజీలు ఉండాలన్నారు. ఎస్సీఈఆర్టీ సిఫారుసులన్నీ అమల్లోకి రావాలని పేర్కొన్నారు. రీసోర్స్ సెంటర్ను మండల విద్యా శాఖాధికారి కార్యాలయంగా మార్పు చేయాలని చెప్పారు. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలు అప్పగిస్తూ ఎస్ఈఆర్టీ చేసిన సిఫారసుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అలానే ఎంఈవో పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె