విశాఖలో మరోసారి పేలుడు

విశాఖలో మరోసారి పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో  మంగళవారం ఉదయం ఒక్కసారిగా...

Published : 04 Aug 2020 12:23 IST

విశాఖపట్నం: విశాఖలో మరోసారి పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో  మంగళవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో ఉన్న రెండు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి దగ్గరలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. పేలుడు ఘటనతో కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని