AP News: ఏపీలో మందు బాబులకు మరో గంట అవకాశం

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందు బాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన  ప్రభుత్వం

Updated : 17 Jan 2022 20:25 IST

అమరావతి: కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో వెసులు బాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10గంటల వరకు మద్యం దుకాణాల పనివేళలు పొడిగిస్తూ ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పొడిగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ దుకాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని