TS News: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి వరించింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్ను తీసుకునేందుకు ముందుకొచ్చింది...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి రానుంది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ల్యాబ్ స్పేస్లో సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. కంపెనీ భారత ప్రతినిధులు చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్తో వర్చువల్గా సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించింది.
లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఇవాన్ హొ కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించారు. తాజా పెట్టుబడితో లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రభుత్వ విజన్కు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో