Andhra News: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి వర్చువల్‌ సమావేశంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు కీలక

Updated : 30 Mar 2022 18:06 IST

అమరావతి: కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి వర్చువల్‌ సమావేశంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

పలు చోట్ల కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు వచ్చాయి. దీంతో రెవెన్యూ డివిజన్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కుప్పం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసినట్టు సమాచారం. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మకూరు, డోన్‌, గుంతకల్లు, ధర్మవరం, పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లు కానున్నాయి. రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటికీ వర్చువల్‌ సమావేశం ద్వారా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 4న ఉదయం 9గంటల5 నిమిషాల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాలు ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ సయంలోనే 26 జిల్లాలను స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టాలని, అప్పటి నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని