AP Cabinet: ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Updated : 07 Jun 2023 18:23 IST

అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు-2023’ పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. 10వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

కేబినెట్‌ ఆమోదించిన నిర్ణయాలు ఇవే..

  •  అమ్మఒడి పథకం అమలును జూన్‌ 28కి వాయిదా వేస్తూ నిర్ణయం.
  • రాష్ట్రంలోని కొత్త మెడికల్‌ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ప్రభుత్వ పింఛన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు ఆమోదం.
  • ఏపీ పౌరసరఫరాల  కార్పొరేషన్‌ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు అనుమతి.
  • జూన్‌ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వహణకు ఆమోదం.
  • పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డుల ప్రదానం.
  • ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసేందుకు నిర్ణయం. అందులో పని చేస్తున్న 14,653 మంది సిబ్బందిని ప్రభుత్వ  ఉద్యోగులుగా నియామకం.
  • సీపీఎస్‌ రద్దు చేసి జీపీఎస్‌ తీసుకురావాలని నిర్ణయం.
  • జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ 12 నుంచి 16 శాతానికి పెంపు. అదనంగా 2.73 శాతం డీఏ పెంపునకు ఆమోదం.
  • చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం.
  • 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ.6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్‌ఎస్ఎల్‌కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర.
  • టోఫెల్ సర్టిఫికేషన్ కార్యక్రమం అమలుకు కేబినెట్ ఆమోదం. 3 తరగతి నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని