Ap Cabinet: ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంపై రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ను ప్రారంభించి.. గతంలో కంటే ముందే కృష్ణా, గోదావరి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంపై రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ను ప్రారంభించి.. గతంలో కంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేయాలని నిర్ణయించింది. గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టాకు జూన్ 10న, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జులై 30న నీరు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు ఖరీఫ్ సీజన్ను ముందే ప్రారంభిస్తే.. నవంబర్లో తుపానులు వచ్చేనాటికి పంట చేతికి వస్తుందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ మేరకు వ్యవసాయరంగంపై మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి కలిగిందన్నారు. సుదీర్ఘకాలంగా పెండిగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో చేయాలని చెప్పారన్నారు. ప్రతీ ఇంటికీ శాసనసభ్యులు వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారని పేర్కొన్నారు. చెప్పింది చేశామన్న అంశాలను ప్రజలకు వివరించటంలో ఏమాత్రం అలసత్వం వద్దని సీఎం సూచించినట్లు చెప్పారు.
కేబినెట్ ఆమోదం తెలిపిన నిర్ణయాలివే..
* సంక్షేమానికి ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రంలో పథకాల అమలుకు ఆమోదం.
* మే 13న కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ప్రారంభం.
* మే 16న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ.
* మే 31న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రెండు దఫాలుగా రూ.7,500 వేసేందుకు నిర్ణయం.
* జూన్ 19న యానిమల్ అంబులెన్సుల ప్రారంభోత్సవం.
* జూన్ 6న కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీ.
* జూన్ 14న వైఎస్ఆర్ పంటల బీమా కింద 2021 ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపు.
* జూన్ 21న అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధుల బదిలీ.
* జూన్ 1న వ్యవసాయానికి సాగునీటి విడుదల ప్రణాళికను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం.
* 2022-27 సంవత్సరాలకు సంబంధించి ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి ఆమోదం.
* 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలకు ఆమోదం.
* నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి ఆమోదం.
* వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1600 కోట్ల రుణ సమీకరణ.
* ప్రతీ జిల్లా కేంద్రం, కార్పొరేషన్లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్ల ఏర్పాటు.
* ప్రవేటు రంగంలో కనీసం వంద పడకలు ఉండేలా ఆస్పత్రుల నిర్మాణం.
* మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాలో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూ కేటాయింపు.
* నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూ కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
* నర్సాపురంలో రైతుల స్వాధీనంలో భూములకు హక్కులు కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి