AP Cabinet: కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ!

ఏపీ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated : 07 Jun 2023 13:07 IST

అమరావతి: ఏపీ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

చిత్తూరు డెయిరీని అమూల్‌కు అప్పగించే అంశంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 2014 జూన్‌ 2వ తేదీనాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీరించాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది. 

సీపీఎస్‌ స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్‌లో మార్పులు చేర్పులపై మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మఒడి ఆర్థికసాయంపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు గురుకులాలు, విశ్వవిద్యాలయాల నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని