CM Jagan: ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి: సీఎం జగన్

ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని ఏపీ సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Updated : 02 Apr 2022 12:51 IST

అమరావతి: ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని ఏపీ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జగన్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పంచాగాన్ని ఆవిష్కరించారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని