AP: మళ్లీ 20వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్‌ పరీక్షించగా 21,452మంది కరోనా బారినపడ్డారు.

Updated : 12 May 2021 18:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్‌ పరీక్షించగా 21,452మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌తో బాధపడుతూ 89మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 8,988కి చేరింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 13,44,386 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విశాఖలో 11మంది మృతి చెందగా, తూర్పుగోదావరి 9, కృష్ణా 9, విజయనగరం 9, చిత్తూరు 8, గుంటూరు 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, కర్నూలు 5, ప్రకాశం 4, పశ్చిమగోదావరి 3, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,927 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 693 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 19,095మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, మొత్తం 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని