Corona: ఏపీలో కేసులు తగ్గుతున్నాయ్‌..!

ఏపీలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 84,502 శాంపిల్స్‌ పరీక్షించగా.. 14, 429మందికి కరోనా

Updated : 28 May 2021 17:03 IST

అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 84,502 శాంపిల్స్‌ పరీక్షించగా.. 14,429 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, 103 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. 20,746 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మరోవైపు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 15మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విశాఖలో 10 మంది, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరి 8, కృష్ణా 8, గుంటూరు 7, విజయనగరం 7, శ్రీకాకుళం 6, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.  

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.90కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 16,57,986 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 14,66,990మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,634మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని