AP Corona: ఆంధ్రలో 99 మంది మృతి

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా

Updated : 18 May 2021 18:29 IST

అమరావతి:  ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా 21,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372 కి చేరింది. తాజాగా 99 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,580కి పెరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. 

కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 9 మంది, అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 21,274 మంది కరోనా నుంచి కోలుకున్నారని,  రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,81,40,307 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని