ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349 కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 858 కేసులు, గుంటూరు జిల్లాలో 596 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ్ కేసులు ఉండగా.. 49,558 మంది
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349 కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210కేసులు, గుంటూరు జిల్లాలో 744 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ్ కేసులు ఉండగా.. 49,558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 49 మంది మృతి చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణ జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,090కి చేరింది. ఒక్క రోజులో 43,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తంగా 16,86446 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..