Andhra Pradesh: ఏపీలో కరోనాతో 11మంది మృతి

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 35,040 మందికి పరీక్షలు చేయగా.. 5,983మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా

Updated : 02 Feb 2022 18:19 IST

అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 35,040 మందికి పరీక్షలు చేయగా.. 5,983మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 11,280 మంది కోలుకోగా.. 11 మంది మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 1,00,622 క్రియాశీల కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా నమోదైన మరణాల్లో విశాఖలో నలుగురు, కడపలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని