సీఎస్‌, డీజీపీకి ఎస్ఈసీ అభినందనలు

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌తో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమావేశమయ్యారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ..

Updated : 24 Dec 2022 15:16 IST

అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌తో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమావేశమయ్యారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో గురువారం అరగంటకు పైగా సమావేశం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపినందుకు సీఎస్‌, డీజీపీకి ఎస్ఈసీ అభినందనలు తెలిపారు. రెండు, మూడు, నాలుగో దశ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిమ్మగడ్డ చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై సమీక్షించారు. రానున్న విడతల్లో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు. 

ఇవీ చదవండి..

శ్రీకాకుళంలో బ్యాలెట్‌ పత్రాల కలకలం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని