‘ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదు’
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పరస్పరం లేఖలు రాసుకున్నారు. ఎస్ఈసీ రాసిన లేఖకు...
ఎస్ఈసీ లేఖకు సమాధానమిచ్చిన సీఎస్
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పరస్పరం లేఖలు రాసుకున్నారు. ఎస్ఈసీ రాసిన లేఖకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ జవాబు ఇచ్చారు. ఎస్ఈసీతో భేటీ కంటే ముందే సీఎస్ తన లేఖను ఎన్నికల సంఘానికి పంపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ సాధ్యమన్నారు. ప్రస్తుతం టీకా అందించే ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేస్తుందన్న ఆరోపణలను ఆదిత్యనాథ్ దాస్ ఖండించారు. కొవిడ్ కారణంగానే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావట్లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరికాదని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..