Andhra News: మరోసారి అస్వస్థతకు గురైన సీఎస్ సమీర్‌శర్మ.. ఆస్పత్రికి తరలింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Published : 04 Nov 2022 01:13 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. వెంటనే గుర్తించి అప్రమత్తమైన అధికారులు సీఎస్‌ను 108వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో సీఎస్‌ సమీర్‌శర్మకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమీర్‌శర్మ ఇటీవలే హైదరాబాద్‌లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజుల నుంచి విధుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్‌ ఆసుపత్రికి ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని