ల్యాప్‌టాప్‌ అడిగిన విద్యార్థులు 35 లక్షల మంది!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విధానం అమలుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు

Updated : 06 Jul 2021 22:10 IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విధానం అమలుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతపురం ఓటీఆర్‌ఐ ప్రాంగణంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఫార్మసీ కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలో రెండు వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ విద్యాబోధనకు రెండు వర్సిటీలను ఎంపిక చేశామన్నారు.

విద్యాదీవెన పథకంలో భాగంగా రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఐచ్ఛికంగా కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు భారం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో టంగుటూరి ప్రకాశంపంతులు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి వీసీని నియమించలేదన్నారు. కేబినెట్‌ ఆమోదంతో ఆంధ్రకేసరి యూనివర్సిటీగా పేరు మార్చి రూ.300 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించినట్లు మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని