AndhraPradesh: చర్చలకు ఎప్పుడూ సిద్ధమే.. కానీ రోజూ ఆహ్వానించాల్సిన అవసరం లేదు: సజ్జల
పథకాలతో పేదల సంక్షేమ బాధ్యత గెజిటెడ్ ఉద్యోగులదేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్
అమరావతి: ప్రభుత్వం అందించే పథకాలతో పేదల సంక్షేమ బాధ్యత చూసుకోవడం గెజిటెడ్ ఉద్యోగులదేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జల, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి ఆదిలమూలపు సురేశ్, ఎమ్మెల్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎస్సీలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులపై అందరూ కలిసి రావాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలను సీఎం పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. చట్ట సవరణ చేసైనా సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు.
ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదని సజ్జల అన్నారు. ఉద్యోగులను రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే.. ఎవరిపై ఒత్తిడి తెస్తారు? అని ప్రశ్నించారు. ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు చేరితే పరిస్థితి చేయి దాటుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఇచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వేళ భారీ సామూహిక కార్యక్రమాలు సరికాదన్నారు. ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు కూడా చేరాయని, ఉద్యోగులు ఉద్యమానికి పార్టీలను స్వాగతిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వివరించారు. ఉద్యోగులే బదిలీలను కోరుతున్నారని, ప్రభుత్వం ప్రక్రియను ఎందుకు ఆపుతుందని చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? అని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చామని ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దంటే ఎలా? అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగుల్లో ఆవేదన ఉందని నారాయణ స్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని చెప్పారు. పదోన్నతుల విషయమై సీఎం దృష్టికి సజ్జల తీసుకెళ్లాలని నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్