Andhra News: ఆర్థిక ఇబ్బందుల వల్లే ‘దుల్హన్’ నిలిపివేత: హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు
ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్రస్తుతం అమలులో లేదని పేర్కొంది. తెదేపా హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది. ఈ పథకం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్ షిబ్లి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ... ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం పథకం అమలు చేయలేకపోతుందని కోర్టుకు తెలిపారు.
‘‘విదేశీ విద్యా పథకం అమలుకు సైతం నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మైనారిటీలకు ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా విదేశీ విద్య పథకం కోసం మైనారిటీలకు సాయం అందడం లేదు. 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించిన 574 మందికి ఇప్పటికీ సాయం విడుదల కాలేదు. ఎస్సీ, బీసీలకు ఆయా సంక్షేమ శాఖల ద్వారా నిధులు విడుదల చేసి మైనారిటీలకు అన్యాయం చేశారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్