‘వ్యాట్ పెంపు.. ఎల్పీజీపై కాదు’
సహజ వాయువుపై విధించే వ్యాట్లో మార్పులు చేస్తే కొందరు ఎల్పీజీపై పన్ను పెంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు.
అమరావతి: సహజ వాయువుపై విధించే వ్యాట్లో మార్పులు చేస్తే కొందరు ఎల్పీజీపై పన్ను పెంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. ఎల్పీజీపై ఎలాంటి పన్నూ పెరగలేదని స్పష్టంచేశారు. సహజ వాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గందరగోళం నెలకొనడంతో ఆయన స్పష్టతనిచ్చారు. ఎల్పీజీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి వచ్చిందని, కేంద్రం పరిధిలో ఉన్న జీఎస్టీ మండలిలో మాత్రమే ఎల్పీజీ సిలిండర్ల పన్ను రేట్లను సవరించగలదని తెలిపారు. ఎల్పీజీపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని చెప్పారు.
జీఎస్టీ పరిధిలోకి రాని ఐదు పెట్రో ఉత్పత్తులు మాత్రమే వ్యాట్ పరిధిలో ఉన్నాయని రజత్ భార్గవ వివరించారు. సహజ వాయువును విద్యుత్ ఉత్పత్తి కోసం, రవాణా వాహనాలైన ఆటోలు, కార్లు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వినియోగిస్తున్నారని, కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గృహ వినియోగానికి సరఫరా అవుతోందని తెలిపారు. ప్రస్తుతం గృహ వినియోగానికి సరఫరా చేస్తున్న సహజ వాయువుకు 5 శాతం వ్యాట్ ఉందని, ఈ పన్ను రేటులో ఎలాంటి మార్పూ చేయలేదని చెప్పారు. గృహ వినియోగం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వాటిపై మాత్రమే ప్రస్తుత పన్ను పెంపు వర్తిస్తుంది స్పష్టంచేశారు. సాధారణ ప్రజలపై సీఎన్జీ పన్ను పెంపు వర్తిస్తుందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రజత్ భార్గవ వెల్లడించారు.
ap news, ap govt, VAT, CNG, LPG, ఏపీ న్యూస్, వ్యాట్, సీఎన్జీ, ఎల్పీజీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM