Andhra news : ఏపీ ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు

పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసినప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని...

Updated : 30 Jan 2022 04:08 IST

అమరావతి: పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసినప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను మరోసారి ఆదేశించింది. ఈ మేరకు వారికి మెమోలు జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించే సహించేది లేదని స్పష్టం చేసింది. 

బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాల్సిందిగా మరోసారి అధికారులను ఆదేశించింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం జారీ చేసిన హెచ్‌ఆర్‌ఏలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు 16 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పని చేసేవారికీ 16 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని