AP High Court: కోర్టులో కేసు జరుగుతుండగా ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారు?: హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోపై స్టే కొనసాగుతున్నా అదే అంశంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. న్యాయస్థానంలో కేసు జరుగుతుండగా ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి వివరణ ఇస్తూ ప్రత్యేక ఆహ్వానితులను నియమించబోమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. ఆ రోజే తుది విచారణ జరిగే అవకాశం ఉంది.
తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై భాజపా నేత భానుప్రకాశ్, మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసురావడంపై వాళ్లు మరోసారి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు