Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు
70 కోర్టుధిక్కరణ కేసుల్లో ఐఏఎస్లు జీకే ద్వివేది, ఎస్.ఎస్ రావత్ హాజరుకావటంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అమరావతి: ఉపాధిహామీ బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించినా.. అధికారులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈరోజు సంబంధిత అధికారులు కోర్టుకు హాజరుకావాలని గత విచారణలో ఆదేశించింది. ఈకేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్.ఎస్.రావత్ , దినేష్ కుమార్ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు.
ఇందులో ద్వివేది, రావత్ 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానానికి హాజరుకావటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని కేసులు నమోదవుతున్నాయంటే.. కోర్టు ఉత్తర్వులంటే అంత లెక్కలేని తనం ఎందుకని న్యాయస్థానం నిలదీసింది. ఏమవుతుందిలే అని బరితెగింపు ప్రదర్శిస్తే.. ఊరుకుంటామనే భ్రమల్లో అధికారులు ఉండొద్దని కోర్టు హెచ్చరికలు చేసింది. రోజూ మిమ్మల్నే చూడటానికి న్యాయస్థానానికే చికాకు వేస్తోందని ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కల్లా ఏపీలోనే కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్న ధర్మాసనం.. అధికారుల తీరే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు