AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
అమరావతి: ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తేనే అధికారులు స్పందించి పనులు చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. దంత వైద్య కళాశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న అరుణ అనే మహిళ.. తనకు 2018 నుంచి జీతం ఇవ్వట్లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీతం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం సీఎంవో కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జీ కోర్టుకు హాజరయ్యారు.
ఒప్పంద ఉద్యోగి అరుణకు హెచ్ఆర్ఏ, డీఏతో కలిపి పూర్తి వేతనం చెల్లించకుండా.. కొంత మొత్తం ఎలా చెల్లిస్తారని ఉన్నత న్యాయస్థానం అధికారులను ప్రశ్నించింది. ఇన్నేళ్లు జీతం ఇవ్వకపోతే అమెకు జీవనోపాధి ఎలా అని నిలదీసింది. ఆమె ఉద్యోగం వదిలేసి వెళ్లి పోయేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ధిక్కరణకు పాల్పడే అధికారుల కోసం హైకోర్టులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి జైలుకు పంపించాల్సి వస్తుందేమోనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరో కోర్టు ధిక్కరణ కేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్