హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌

తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరులో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు

Updated : 27 Jul 2020 16:00 IST

అమరావతి: తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని