job notification: సివిల్ జడ్జి పోస్టులకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్.. వేతనం ఎంతంటే?
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు(AP High court) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు మార్చి 17 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
అమరావతి: న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు(AP High court) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 24 ఖాళీలు, బదిలీల ద్వారా మరో 6 ఖాళీల్ని భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు..
- మొత్తం పోస్టుల సంఖ్య: 30
- అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి
- వయోపరిమితి: 01-03-2023 నాటికి 35 ఏళ్లు మించరాదు.
- వేతనం: రూ.77,840 – రూ.1,36,520
- ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన. స్క్రీనింగ్పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత రాత పరీక్షనిర్వహిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: ఓపెన్ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్/బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే రూ.750లు చెల్లిస్తే సరిపోతుంది.
- స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్లు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అభ్యర్థులు ఏవైనా మూడు కేంద్రాలను ప్రాధాన్యతల వారీగా ఆప్షన్ పెట్టుకోవచ్చు.
ఇవి గుర్తు పెట్టుకోండి..
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 17 నుంచి
- దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్ 6
- స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: ఏప్రిల్ 15
- కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్: ఏప్రిల్ 24 (ఉదయం 8.30గంటల నుంచి 10.30గంటలవరకు)
- ప్రిలిమినరీ కీ/అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 27
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!