Andhra News: విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలతో మంత్రి బాలినేని చర్చలు
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఐకాస నేతలతో చర్చిస్తున్నారు. గత నెల 28న 24 డిమాండ్లతో ఉద్యోగులు ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతున్నారు.
విజయవాడ: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఐకాస నేతలతో చర్చిస్తున్నారు. గత నెల 28న 24 డిమాండ్లతో ఉద్యోగులు ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతున్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు నోటీసులో పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటు చేసిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వేతన సవరణ బాధ్యతను విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది క్రమబద్ధీకరణకు డిమాండ్ చేశారు. వీటన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని చర్చిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.