Andhra News: రండి మళ్లీ చర్చిద్దాం: ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స పిలుపు
ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి పిలుపొచ్చింది. ఈరోజు చర్చలకు రావాలని ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్ సంఘాలను మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్) అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా మంత్రి బొత్సతో జరిగే సమావేశంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్)పై చర్చ అంటే ఏం చేయాలన్న దానిపై ఉద్యోగ సంఘాలు తర్జన భర్జన పడుతున్నాయి. అసలు సమావేశానికి వెళ్లాలా? వద్దా. అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్కు అంగీకరించేది లేదని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని గతంలోనే బొత్సకు తెలిపాయి. ఓపీఎస్ మినహా ఏ ప్రతిపాదనకూ అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే చలో విజయవాడ, మిలియన్ మార్చ్ సభల అనుమతికి ఉద్యోగ సంఘాలు యత్నిస్తుండటం, నిరసనకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిలుపురావడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి