Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
అర్చకుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన పర్యవేక్షణ దేవాదాయశాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అమరావతి: అర్చకుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన పర్యవేక్షణ దేవాదాయశాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్చకుల చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని మాత్రమే వారు అనుభవించవచ్చన్నారు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవాదాయశాఖవే.. దాని మీద ఫలసాయం పొందే అవకాశం మాత్రమే దరఖాస్తు దారులకు ఉంటుందని తెలిపారు. దేవాదాయశాఖలో ఉద్యోగుల కొరత ఉందన్న మంత్రి.. నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ ఉద్యోగులను దేవాదాయశాఖలోకి తీసుకుంటున్నామన్నారు. ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప... నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా అని వ్యాఖ్యానించారు.
4.20లక్షల ఎకరాల భూమి దేవాదాయశాఖ పరిధిలో ఉందని, వీటిలో కొన్ని ఆక్రమణల్లో ఉన్నాయన్నారు. దేవుడి మాన్యం భూముల్లో ఆక్రమణలను స్వాధీనం చేసుకునేప్రయత్నం చేస్తామన్నారు. సీఎం జగన్ ఆదేశంతోనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. మఠాధిపతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ సమస్యను ధార్మిక పరిషత్ పరిష్కరిస్తుందన్నారు. మఠాలకు, పీఠాలకు భూముల లీజు, లీజు పొడిగింపు అంశాలను ధార్మిక పరిషత్తే పర్యవేక్షిస్తుందన్నారు. దేవాదాయశాఖ చేయలేని ఎన్నో పనులను ధార్మిక పరిషత్ ద్వారా చేసే అవకాశం ఉందన్నారు. ధూప దీప నైవేద్యాల నిమిత్తం నిధులు కావాలని సుమారు 3,500 దేవాయాలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి దేవాయాలయానికి ధూప దీప నైవేద్యం స్కీం కింద నెలకు రూ.5వేల చొప్పున నిధులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం పడగొట్టిన 44 ఆలయాల్లో ఏడు ఆలయాల పునఃనిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
రాజధాని అమరావతి (Amaravati)నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. -
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
-
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
-
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా