Andhra News: సీఐడీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు
తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్ నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్ నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. జీజీహెచ్ వద్ద బారికేడ్లు పెట్టడంతో పాటు అక్కడి వంతెన వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు సీఐడీ కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించగా వారిని ఆపేశారు. ఆంక్షలతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసుల ఆంక్షలపై తెలుగు యువత నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతలను అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో తెలుగు యువత నాయకులు మల్లేశ్వరరావు, రావిపాటి సాయికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన ఎమ్మెల్సీ అశోక్బాబును కలిసేందుకు ఈ ఉదయం మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు నేతలు సీఐడీ కార్యాలయానికి వెళ్లగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం దేవినేని ఉమ సహా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం