AP PRC: కమిటీ 30శాతం సిఫార్సు చేస్తే.. 23శాతం ఇస్తారా?: వెంకట్రామిరెడ్డి
ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,
కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కర్నూలులో చేపట్టిన ఉద్యోగులు ఆందోళనల్లో జేఏసీ నేత హృదయరాజుతో పాటు వెంకట్రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘ఆఫీసర్స్ కమిటీ 30శాతం జీతాలు పెంచాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫారసులు పక్కనపెట్టి 23శాతమే ఇస్తామంటున్నారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం న్యాయమేనా?’’అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.
పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శ్రీకాకుళంలో పీఆర్సీ కోసం సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో హోమ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరానికి హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా 13 జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. నాలుగు జేఏసీలు న్యాయమైన ధర్మపోరాటం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు పాల్గొన్నాయి.
రివర్స్ పీఆర్సీ.. గుంటూరులో వెనక్కి నడిచి ఉద్యోగుల నిరసన
గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు వరుసగా నాలుగో రోజూ రిలేదీక్షలు కొనసాగించారు. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో పాల్గొన్నవారికి భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు