కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ కీలక ఆదేశాలు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో
అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేశారు. పత్రాల జారీలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు, ఎస్ఈలతో గతం మరిచి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిద్దామని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వీడియోలు, ఫొటోలు యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించవద్దని.. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే వారిపై చర్యలు తప్పవన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఏకగ్రీవాల్లో అక్రమాలు నిర్ధారణ అయితే ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!