APSLPRB: ఏపీ ఎస్సై రాత పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు.
అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు 30 శాతం, బీసీలకు 35, ఓసీలకు 40 శాతంగా నిర్ణయించారు.
రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు రిక్రూట్మెంట్బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం