New Jobs: ‘పది’తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1,675 ఉద్యోగాలు.. 28నుంచి అప్లై చేసుకోండి!
కేంద్ర నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో( Intelligence Bureau)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,675 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (Security Assistant/Executive) పోస్టులు 1,525 కాగా.. మల్టీ టాస్కింగ్(Multi-Tasking Staff/) సిబ్బంది పోస్టులు 150 ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేకొనేందుకు అర్హులు. తొలుత ఈ నెల 21నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కీలక మార్పులు చేశారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తుల సమయాన్ని పొడిగిస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 17లోగా దరఖాస్తులు చేసుకోచ్చని అధికారులు సూచించారు. ఎంటీఎస్ పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్లు (ఫిబ్రవరి 17 నాటికి) మించరాదు. అదే సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే 27 ఏళ్లు మించరాదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలకు మూడేళ్ల పాటు సడలిస్తారని పేర్కొన్నారు. టైర్ 1, టైర్2, టైర్ 3 దశల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు రుసుము 50లు కాగా.. అదనంగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.450లు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో నైపుణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేతన శ్రేణి రూ.21,700 నుంచి 69,100గా ఉండగా.. మల్టీ టాస్కింగ్ పోస్టులకు వేతన శ్రేణి రూ. 18వేలు నుంచి 65,900లుగా ఉంది. దీంతో పాటు కొన్ని అలవెన్సులు కూడా అదనం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..