APPSC: ప్రాథమిక పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జూలైలో ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష తేదీలను ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ ప్రకటించారు. జూలై 24న దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు, జులై 31న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లను త్వరలో ఎపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు.
రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న ఎపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనుంది. దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ పరీక్షను పెట్టాల్సి వచ్చిందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పక్కన పెట్టి ఈ రెండు పరీక్షలనూ ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు