AP News: దేవాదాయ డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక చల్లిన అసిస్టెంట్‌ కమిషనర్‌

విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated : 05 Aug 2021 16:37 IST

విశాఖపట్నం: విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్ధన్‌ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్పవర్ధన్‌ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చర్యలతో నిర్ఘాంతపోయిన పుష్పవర్ధన్‌.. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి విజిలెన్స్‌ సిబ్బంది చేరుకుని మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని