Italy: కంటికి కనిపించని కళాఖండాన్ని అమ్మేశారు..!
కళా ప్రపంచానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఇటలీకి చెందిన సాల్వటోర్ గారో విషయంలో అదే నిజమైంది. ఆయన ‘లో సోనో’(నేను) అనే పేరుతో రూపొందించానని చెబుతోన్న ఓ కళాఖండాన్ని 18,000 డాలర్లకు విక్రయించారు.
రోమ్: కళా ప్రపంచానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఇటలీకి చెందిన సాల్వటోర్ గారో విషయంలో అదే నిజమైంది. ఆయన ‘లో సోనో’(నేను) అనే పేరుతో రూపొందించానని చెబుతోన్న ఓ కళాఖండాన్ని 18,000 డాలర్లకు విక్రయించారు. ధర పరంగా చూసుకుంటే ఇది చెప్పుకునే విషయమేమీ కాకపోయినా.. ఆయన అమ్మింది ఓ అదృశ్య శిల్పాన్ని(Invisible Sculpture). ఈ విషయమే ఇప్పుడు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా వివరాలు వెల్లడించింది.
కొద్ది రోజుల క్రితం సాల్వటోర్.. ‘లో సోనో’ను ఇటాలియన్ ఆక్షన్ హౌస్ ‘ఆర్ట్ రైట్’లో అమ్మకానికి ఉంచారు. ఆ అదృశ్య శిల్పం 6 నుంచి 8 వేల డాలర్లు పలుకుతుందని అక్కడి సిబ్బంది అంచనా వేశారు. కానీ అది మాత్రం 18,300 డాలర్లకు అమ్ముడైంది. ఈ సందర్భంగా దాని రూపకర్త సాల్వటోర్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఒక కళాఖండాన్ని ఖాళీ ప్రదేశంగా భావిస్తాను. ఆ ఖాళీ ప్రదేశం పూర్తిగా శక్తితో నిండి ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని ఖాళీ చేస్తే అక్కడేమీ ఉండదు(నథింగ్). కానీ హైసన్బర్గ్ అన్సెర్టెయినిటీ నియమం ప్రకారం.. ఆ ఏమీలేని దగ్గర కూడా బరువు ఉంటుంది. మనం చూడలేని శక్తి అక్కడ ఉంటుంది. అది గాలి, ఆత్మతో తయారై ఉంటుంది. గాలి, ఆత్మతో కూడిన ఈ శిల్పాన్ని కృత్రిమ వెలుతురు, వాతావరణ నియంత్రణ లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి’ అని చెప్పుకొచ్చారు. అలాగే తన కళను సమర్థించుకుంటూ.. ‘మనం ఎన్నడూ చూడని దేవుని ఆకృతిని తయారు చేయలేదా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ అదృశ్య శిల్పంలాంటి అంశాలు ఆయనకు కొత్తేం కాదు. ఫిబ్రవరిలో ఈ తరహాలోనే తన కళను ప్రదర్శించారు.
నాన్ ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ)కు ప్రజాదరణ లభిస్తోన్న తరుణంలో అదృశ్య కళలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఎఫ్టీలను డిజిటల్ ఆస్తులుగా చెప్పుకోవచ్చు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా వర్తకం చేసే వీలున్న ఈ డిజిటల్ ఆస్తులు నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్విటర్ సీఈఓ జాక్డోర్సే చేసిన తొలి ట్వీట్ రూ.21 కోట్లకు వేలంలో అమ్ముడుపోయినప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రచారంలోకి వచ్చింది. వీటి ద్వారా ట్వీట్లు, చిత్రాలు, వీడియోలు.. ఇలా వేలానికి ఉంచిన వేటినైనా కొనుగోలు చేయొచ్చు. ఈ ప్రక్రియ అంతా జరిగేది డిజిటల్ ప్రపంచంలో మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!