AP News: వైభవంగా దుర్గమ్మకు ఆషాఢ సారె
ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా
విజయవాడ: ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉదయం ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాదశర్మ, ఆలయ సిబ్బంది అమ్మవారికి మొదటిసారె సమర్పించారు. మేళతాలాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారికి కంఠాభరణాన్ని సమర్పించారు. ఆగస్టు 8 వరకు ఆషాఢ సారె కార్యక్రమం జరుగుతుందని ఛైర్మన్ తెలిపారు. సారె సమర్పించడానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా