Delta variant: ఆసియా దేశాల్లో డెల్టా అలజడి
ఆసియా దేశాల్లో డెల్టా వేరియంట్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్కు చెందినవే కావడంతో ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి....
కట్టడి చర్యలను ప్రారంభించిన పలు దేశాలు
దిల్లీ: ఆసియా దేశాల్లో డెల్టా వేరియంట్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్కు చెందినవే కావడంతో ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వేగంగా వ్యాపించే లక్షణాలున్న డెల్టా వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలతో ఇప్పటికే పలు దేశాలు కట్టడి చర్యలను వేగవంతం చేశాయి. తొలుత భారత్లో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పటివరకు 132 దేశాలకు పైగా పాకింది. ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న జపాన్ సహా థాయ్లాండ్, మలేసియాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో నగరంలో శనివారం ఒక్కరోజే 4058 కేసులు, మలేసియాలో 17,786 కేసులు నమోదయ్యాయి. థాయ్లాండ్లో 18,912 కేసులు నమోదవ్వగా.. వాటిలో 60 శాతానికి పైగా డెల్టా వేరియంట్కు చెందినవేనని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో టోక్యో సహా ఆరు నగరాల్లో ఈ నెలాఖరు వరకు జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. వియత్నాంలో సోమవారం నుంచి 18 నగరాలతోపాటు పలు ప్రావిన్స్లలో రెండు వారాలపాటు కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. బీజింగ్ సహా 15 నగరాల్లో డెల్టా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ను కట్టడించేందుకు భారీ సంఖ్యలో కొవిడ్ టెస్టులతోపాటు, రెండు డోసులు వేసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని యోచిస్తోంది.
గడిచిన 4 వారాల్లో.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు సగటున 80 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో బయటపడ్డ డెల్టా వేరియంట్.. అంటువ్యాధి చికెన్పాక్స్ లక్షణాలు కలిగిఉన్నట్లు అమెరికా వ్యాధి నిర్మూలన కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి కూడా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించగలదని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ