AskKTR: తర్వాత సీఎం అభ్యర్థి మీరేనా..? నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఏంటంటే?
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో...
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. కాలిగాయంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన.. తాజాగా ట్విటర్ వేదికగా నెటిజన్లతో ‘#AskKTR’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు
ప్రశ్న: మీ ఆరోగ్యం ఎలా ఉంది?
కేటీఆర్: నేను ఆరోగ్యంగానే ఉన్నా బ్రదర్.
ప్రశ్న: తర్వాతి ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు?తెరాస నుంచి సీఎం అభ్యర్థి మీరేనా?
కేటీఆర్: కేసీఆర్ గారి రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు.
ప్రశ్న: భాజపా నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
కేటీఆర్: ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ.
ప్రశ్న: నేటి యువత రాజకీయాల్లోకి రావచ్చా?ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలపై మీ మోటో ఏంటి? ఎలాంటి నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరేం చెబుతారు?
కేటీఆర్: ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లో రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం సర్తో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు.
ప్రశ్న: సెక్రటేరియట్ ఎప్పుడు రెడీ అవుతుంది సర్?
కేటీఆర్: దసరాకు సిద్ధమవుతుందని నేను ఆశిస్తున్నా.
కేటీఆర్ సర్ మిమ్మల్ని బిగ్స్క్రీన్పై చూడాలనుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉందా?
కేటీఆర్: ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్స్క్రీన్’పై చూడొచ్చు.
ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ సీఎం.. ప్రధానికన్నా గొప్పవారా? హిందీలో సమాధానం ఇవ్వగలరు!
కేటీఆర్: ప్రొటోకాల్ను స్పష్టంగా పాటించాం. ప్రైవేటు విజిట్లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మరొక విషయం దీనిని హిందీలో రాయాల్సిన అవసరం లేదు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ అభిమాని మీరే మా హీరో అంటూ మంత్రి కేటీఆర్ చిన్న నాటి చిత్రాన్ని ట్విటర్లో పంచుకున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. అది నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ జెండాను వాట్సప్ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా?
కేటీఆర్: సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుంది.
విద్యుత్ రంగంలో సంస్కరణలపై మీ విధానం ఏంటి?
కేటీఆర్: భారత్ లాంటి దేశంలో సమతుల్యత అనేది అవసరం. పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి.
ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో గొప్పగా చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ ఎందుకు చేయలేకపోతున్నారు?
కేటీఆర్: ఈ విషయంలో మనం కూడా మనవంతు కృషి చేయాలి. అందుకే ‘10 మినిట్స్ - 10 ఏఎం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.
మన రాష్ట్రంలో బ్యాడ్మింటన్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇతర క్రీడలనూ ఎందుకు ప్రొత్సహించకూడదు?
కేటీఆర్: తప్పకుండా చేద్దాం.
తర్వాత వచ్చే ఎన్నికలకి మన ప్రత్యర్థిగా ఏ జాతీయ పార్టీతో పోరాడాలి?రెండు జాతీయ పార్టీలతో ఒకేసారి యుద్ధం సాధ్యమేనా?మన ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని చూడాలి?
కేటీఆర్: జాతీయ పార్టీలే ఎందుకు? పోరులో ఇంకా చాలా మంది ఉన్నారు.
తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు.. జిల్లాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలి సర్..
కేటీఆర్: అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాం బ్రదర్..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి