Andhra News: ఏపీ రాజ్భవన్లో ఎట్హోం.. హాజరైన సీఎం జగన్, చంద్రబాబు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ కార్యక్రమం రద్దు అయింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు, తెదేపా అధినేత చంద్రబాబు, అధికార, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, త్రివిద దళాల ప్రతినిధులు ఇతర ప్రముఖులు ఎట్ హోంకు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు గవర్నర్కు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు రాజకీయ పార్టీల నేతలు పరస్పర అభినందనలు తెలియజేసుకోవడం, ఒక దగ్గర కూర్చోవడం, పరస్పరం మాట్లాడుకోవడం, గవర్నర్తో కలిసి అంతా ఓ ఫొటో దిగడం పరిపాటిగా వస్తోంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హయాంలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. ఈ మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరైన సందర్భం ఇదే కావడం విశేషం. ఇరువురు ఒకరికి ఒకరు ఎదురుపడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఇద్దరూ వారికి కేటాంచిన స్థానాల్లో కూర్చుండిపోయారు. తేనీటి విందు అనంతరం ఎవరికి వారు వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!