Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్రెడ్డి: సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
వైఎస్ అవినాష్రెడ్డిని ఈ కేసులో సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. కానీ, ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్లో మాత్రం ఏ8గా సీబీఐ ప్రస్తావించింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి ప్రమేయం ఉందని, దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ పేర్కొంది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది.
వివేకా పీఏ చెప్పకముందే జగన్కు తెలుసు..
ఎన్.శివశంకర్రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాష్రెడ్డి హత్యాస్థలికి చేరారు. ఉదయం 5.20కి ముందే అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్రెడ్డి చెప్పారు. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. వివేకా హత్య విషయం సీఎం జగన్కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని సీబీఐ పేర్కొంది. ఈ దశలో భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారు. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి. అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్రెడ్డి బలానికి నిదర్శనం. భాస్కర్రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే. భాస్కర్రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్రెడ్డి చెప్పడం అబద్ధం. కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయి.
పేలుడు పదార్థాల చట్టం సహా 3 కేసులు గతంలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఇందులో రెండు కేసులు వీగిపోగా, మరొకటి తప్పు కేసుగా తేల్చి కొట్టివేశారు. కేసుల ప్రకారం భాస్కర్రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. వివేకా హత్యకేసులో ప్రమేయాన్ని చూసినా.. భాస్కర్రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకమే. ఏప్రిల్16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్కు కారణం కారాదు. దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగానే ఉంది. దస్తగిరికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దస్తగిరిని అరెస్టు చేసి రూ.20వేలు, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్పై విడుదల చేశాం. రక్తం మరకలు తుడవక ముందే ఫొటోలు, వీడియో తీశారు కాబట్టి సాక్ష్యాలకు ఆటంకం లేదన్న వాదన సరికాదు. బెయిల్ సమయంలోనే సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం తగదు. ప్రస్తుత దశలో సాక్ష్యాలను పరిశీలించడం ప్రాసిక్యూషన్కు నష్టం అని సీబీఐ వెల్లడించింది.
భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు: సునీత
వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. ఈమేరకు సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వివేకా హత్యకేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని, భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. భాస్కర్రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలు ప్రస్తావించారు. మరో వైపు వివేకా హత్యకేసులో సీబీఐ న్యాయవాదికి సాయం చేసేలా అనుమతించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈనెల 16కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!