బుడతడికి పోలీసు రక్షణ
గుజరాత్లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు.
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు. పుట్టిన రెండు నెలలకే రెండు సార్లు అపహరణకు గురికావడంతో బాలుడిని రక్షించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్, గాంధీనగర్లోని అదలాజ్ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్ నెలలో మగబిడ్డ జన్మించాడు. పుట్టిన రెండురోజులకే ఆసుపత్రినుంచి ఆ బాలుడు అపహరణకు గురయ్యాడు. పోలీసులు వారంలోగా కిడ్నాప్ చేసిన నిందితులను పట్టుకుని బాలుణ్ని దంపతులకు అప్పగించారు. సదరు బాలుడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్కు గురి అయ్యాడు. మరలా పోలీసులు రంగంలోకి దిగి నాలుగు రోజుల్లో కిడ్నాప్ను ఛేదించి బాలుణ్ని రక్షించారు. సీసీ టీవి దృశ్యాల ఆధారంగా పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్ అయిన బాలుడికి ఇకమీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. బాలుడి రక్షణ కోసం వాళ్లకు స్థిర నివాసం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్