విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కృషి మరువలేనిది: పీవీ సింధు

దేశంలోనే తొలి ఆక్సిజన్‌ రైలును కొవిడ్‌ ఆస్పత్రులకు పంపించి ఘనత సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధుతో ప్రచార చిత్రం రూపొందించింది. ఈ సందర్భంగా సింధు మాట్టాడుతూ.. అత్యంత కష్ట సమయంలో ప్రాణవాయువు అందిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అభినందించింది....

Published : 25 Apr 2021 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోనే తొలి ఆక్సిజన్‌ రైలును కొవిడ్‌ ఆస్పత్రులకు పంపించిన విశాఖ ఉక్కు పరిశ్రమ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధుతో ప్రచార చిత్రం రూపొందించింది. ఈ సందర్భంగా సింధు మాట్టాడుతూ.. అత్యంత కష్ట సమయంలో ప్రాణవాయువు అందిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అభినందించింది. సంస్థ కృషిని దేశం మరవబోదంటూ ప్రశంసించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరును గౌరవిస్తూ ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. ధైర్యంగా కొవిడ్‌ను ఎదుర్కోవాలని సింధు పేర్కొంది. అందరూ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని