Andhra news: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు
గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసిన 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబుకు బెయిల్......
గుంటూరు: గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసిన 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబుకు బెయిల్ మంజూరైంది. ఈరోజు ఆయన్ను సీఐడీ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అంకబాబును రిమాండ్కు తరలించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, సీఐడీ రిమాండ్ నివేదికను కొట్టివేసిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా?: పవన్ ఆగ్రహం
అంకబాబు అరెస్టు వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారం రవాణాపై పోస్టు పెడితే అరెస్టు చేయడం దారుణమనారు. నిరసన తెలిపిన జర్నలిస్టుల అరెస్టు నిరంకుశ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేసినా సీఐడీ పట్టించుకోదంటూ విరుచుకుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!