Hyderabad: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

నగరంలో బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ రథోత్సవం కన్నుల పండువగా కొనసాగుతోంది. అమ్మవార్ల రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కొబ్బరికాయ కొట్టి

Updated : 06 Jul 2022 21:34 IST

హైదరాబాద్: నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ రథోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా సాగింది. అమ్మవార్ల రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ప్రారంభించారు. ఊరేగింపు సందర్భంగా బల్కంపేట పరిసర ప్రాంతాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల మధ్య భక్తిశ్రద్ధలతో జరుగుతున్న రథోత్సవానికి భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి, ఆలయ ఈవో అన్నపూర్ణ, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని