తెలంగాణలో బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం...
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 18న పురపాలక సంఘాల పరిధిలో, 19న జీహెచ్ఎంసీ పరిధిలో లాటరీ విధానంలో లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల గడువు ఈనెల 8న ముగిసింది. మొత్తం 7,360 దరఖాస్తులు రాగా.. చివరిరోజైన సోమవారం ఒక్కరోజే 5,311 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మొదట నిర్దేశించిన గుడువులోగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు రుసుం కింద రూ.73.60 కోట్ల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. తాజాగా గడువు పొడిగించడం ద్వారా దరఖాస్తు రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా రూ. 100 కోట్ల మేర రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’